నెలరోజుల్లో రెండు ఫంక్షన్ ​హాళ్లు ప్రారంభిస్తాం :   మంత్రి హరీశ్​ రావు

నెలరోజుల్లో రెండు ఫంక్షన్ ​హాళ్లు ప్రారంభిస్తాం :   మంత్రి హరీశ్​ రావు

సిద్దిపేట, వెలుగు :   సిద్దిపేట పట్టణంలోని వైశ్య సదన్, గౌడ ఫంక్షన్ హాళ్లను నెలరోజుల్లో ప్రారంభిస్తామని మంత్రి హరీశ్​ రావు తెలిపారు. ఆదివారం పట్టణ శివార్ల లో  నిర్మిస్తున్న  ఆ రెండు ఫంక్షన్ హాళ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికే మోడల్ గా  వైశ్య సదన్ ను నిర్మిస్తున్నామని చెప్పారు. చిన్నచిన్న పెండింగ్​ పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్​ను ఆదేశించారు.  ఆత్మగౌరవ ప్రతీకగా సిద్దిపేట గౌడ ఫంక్షన్ హాల్ నిర్మితమైందని, తుది మెరుగులు దిద్ది  త్వరలో  ప్రారంభిస్తామని చెప్పారు.

టీహెచ్ ఆర్ నగర్​లో బస్తీ దవాఖానాసిద్దిపేట పట్టణంలోని టీహెచ్ ఆర్ నగర్​లో త్వరలోనే బస్తీ దవాఖానాను ప్రారంభిస్తామని మంత్రి హరీశ్​ రావు తెలిపారు.  ఆదివారం టీహెచ్ఆర్ నగర్ శ్రీ ముత్యాల పోచమ్మ ఆలయ ఐదవ వార్షికోత్సవం, బోనాల జాతర లో  మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాలనీకి రేషన్ షాపు కావాలనే   ప్రజల  కోరికను నెరవేరుస్తామన్నారు.  టీహెచ్ఆర్ నగర్ లో రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణానికి  దశల వారీగా నిధులు విడుదల చేయిస్తామని హామీనిచ్చారు.  అంతకు ముందు సుభాష్​ నగర్ పోచమ్మ బోనాల కార్యక్రమంలో మంత్రిపాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.