రాష్ట్రంలో బీజేపీ ఆగడాలు పెరిగిపోతున్నాయి : కేటీఆర్

రాష్ట్రంలో బీజేపీ ఆగడాలు పెరిగిపోతున్నాయి  : కేటీఆర్

బీజేపీపై మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డైరెక్షన్ లోనే మునుగోడు నియోజకవర్గంలోని పలివెలలో టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి జరిగిందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ ఆగడాలు పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో కావాలనే కాషాయ నేతలు హింసను రెచ్చగొడ్డుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సరైన పద్ధతి కాదని సూచించారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాలతోనే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నం చేశారన్నారు.   

నిన్న పలివెలలో టీఆర్ఎస్ కార్యకర్తలపై బీజేపీ శ్రేణులు రాళ్లు, కర్రలతో దాడి చేశారని మంత్రి కేటీఆర్ తెలిపారు. దాడికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు తమ దగ్గర ఉన్నాయన్నారు. ఈటల రాజేందర్ పీఏ మహేష్ స్వయంగా రాళ్ల దాడికి పాల్పడ్డారని చెప్పారు. పలివెలలో 12 మంది టీఆర్ఎస్ కార్యకర్తలకు గాయాలయ్యాయని వెల్లడించారు. మునుగోడు గొడవలో గాయపడిన టీఆర్ఎస్ కార్యకర్తలను  కేటీఆర్ పరామర్శించారు. నాగోల్ లోని SLMS హాస్పిటల్ కు వెళ్లి బాధితులను ఆయన పరామర్శించారు.