ముందస్తుపై సంకేతాలిచ్చిన మంత్రి కేటీఆర్

ముందస్తుపై సంకేతాలిచ్చిన మంత్రి కేటీఆర్

ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్దంగా ఉన్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై ఆయన పరోక్షంగా సంకేతాలిచ్చారు. నిజామాబాద్ నుండే బీఆర్ఎస్ భారీ మెజార్టీతో ఎమ్మెల్యే, ఎంపీలు గెలవాలని సూచించారు. ఇవాళ మంత్రి కేటీఆర్ నిజామాబాద్లో పర్యటిస్తున్నారు. స్థానికంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అందులో భాగంగా రైల్వే ఓవర్ బ్రిడ్జ్‌ను ప్రారంభించారు. అనంతరం ఇందూరు కళాభారతికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ముందస్తుపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది.