- సంప్రదింపుల తర్వాత తెలంగాణ భవన్ లోపల నిర్వహణకు ఓకే
హైదరాబాద్, వెలుగు : దీక్షా దివస్సందర్భంగా బీఆర్ఎస్వర్కింగ్ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్లో బుధవారంరక్తదానం చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం నిరాహార దీక్ష ప్రారంభించిన రోజైన నవంబర్29న ప్రతి ఏడాది దిక్షా దివస్ నిర్వహిస్తున్నారు. ఈ సారి కూడా తెలంగాణ భవన్ వద్దదీక్షా దివస్నిర్వహించేందుకు బీఆర్ఎస్ ఏర్పాట్లు చేసింది. అయితే ఎలక్షన్ కోడ్ ఉండడంతో అధికారులు అందుకు నిరాకరించారు.
తెలంగాణ భవన్ వద్ద ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని సూచించారు. అయితే పై అధికారులతో సంప్రదింపుల తర్వాత భవన్లోపల కార్యక్రమం నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో భవన్ లోపల కేటీఆర్ బ్లడ్డొనేషన్క్యాంపు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు శంభీపూర్రాజు, నవీన్కుమార్, నాయకులు సోమ భరత్కుమార్, వాసుదేవ రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, రాజేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.