కేటీఆర్ ​రక్తదానం .. దీక్షా దివస్ కు తొలుత అనుమతించని పోలీసులు 

కేటీఆర్ ​రక్తదానం .. దీక్షా దివస్ కు  తొలుత అనుమతించని పోలీసులు 
  • సంప్రదింపుల తర్వాత తెలంగాణ భవన్ లోపల నిర్వహణకు ఓకే

హైదరాబాద్, వెలుగు :  దీక్షా దివస్​సందర్భంగా బీఆర్ఎస్​వర్కింగ్​ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్​లో బుధవారం​రక్తదానం చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం నిరాహార దీక్ష ప్రారంభించిన రోజైన నవంబర్​29న ప్రతి ఏడాది దిక్షా దివస్​ నిర్వహిస్తున్నారు. ఈ సారి కూడా తెలంగాణ భవన్​ వద్ద​దీక్షా దివస్​నిర్వహించేందుకు బీఆర్ఎస్​ ఏర్పాట్లు చేసింది. అయితే ఎలక్షన్​ కోడ్​ ఉండడంతో అధికారులు అందుకు నిరాకరించారు.

తెలంగాణ భవన్​ వద్ద ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని సూచించారు. అయితే పై అధికారులతో సంప్రదింపుల తర్వాత భవన్​లోపల కార్యక్రమం నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో భవన్​ లోపల కేటీఆర్ బ్లడ్​డొనేషన్​క్యాంపు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు శంభీపూర్​రాజు, నవీన్​కుమార్, నాయకులు సోమ భరత్​కుమార్, వాసుదేవ రెడ్డి, శ్రీనివాస్​రెడ్డి, రాజేశ్వర్​రావు తదితరులు పాల్గొన్నారు.