10రోజుల పాటు కేటీఆర్ విదేశీ టూర్

10రోజుల పాటు కేటీఆర్ విదేశీ టూర్

మంత్రి కేటీఆర్ నేటి నుండి 10రోజుల పాటు విదేశాల్లో పర్యటించనున్నారు. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకరావడమే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగనుంది. బ్రిటన్ తో పాటు స్విట్జర్లాండ్ లో ఆయన పర్యటించనున్నారు. ఇవాళ 10 గంటలకు శంషాబాద్  ఎయిర్ పోర్టు నుండి  లండన్ కు వెళ్తారు. అక్కడ మూడు రోజుల పాటు వివిధ సంస్థల అధిపతులు, సీఈవోలతో భేటీ కానున్నారు. 

ఆ తర్వాత ఈ నెల 22 నుంచి 26 వరకు స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరగనున్న  ప్రపంచ ఆర్థికవేదిక సదస్సులో కేటీఆర్ పాల్గొంటారు. ఆ సదస్సులో వివిధ దేశాల రాజకీయ, అధికార, వ్యాపార ప్రముఖులతో సమావేశం కానున్నారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్ ద్వారా సామాన్యులకు మెరుగైన సేవలు అన్న అంశంపై ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో కేటీఆర్‌ ప్రసంగించనున్నారు. ఈ నెల 26న తిరిగి రాష్ట్రానికి చేరుకోనున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో యూకేలోని వెస్ట్‌ లండన్‌లోని పలు ప్రాంతాల్లో కేటీఆర్‌కు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు వెలిశాయి.

 

 

 

 

 

మరికొన్ని వార్తల కోసం

అదానీ.. ఇండియాలో నం.2 సిమెంట్​ కంపెనీ

లోన్ల కోసం ఫైనాన్స్‌‌ సంస్థలతో మాట్లాడండి