తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్కు అరుదైన ఆహ్వానం అందింది. 2024 ఫిబ్రవరిలో జరగనున్న ఇండియా కాన్ఫరెన్స్లో ప్రసంగించాలని హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఆయనకు ఆహ్వానం అందింది.
‘ఇండియా రైసింగ్- బిజినెస్, ఎకానమీ, కల్చర్’ థీమ్తో ఈ సదస్సు నిర్వహించనున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ ఆహ్వానంపై మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధి విధానాలను వివరించేందుకు మంచి అవకాశమని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా వెయ్యిమందికి పైగా వ్యాపరవేత్తలు ఇతర ప్రముఖులు ఈ సదస్సుకు హాజరుకానునన్నారు. కాగా హార్వర్డ్ ఆహ్వానం కేటీఆర్ కి ఇదే మొదటిది కాదు. గతంలో కూడా ఆయనకు ఈ ప్రఖ్యాత యూనివర్శిటీ నుంచి కాన్ఫరెన్స్ లలో పాల్గొనేందుకు ఆహ్వానాలు అందాయి.