అమర్ రాజా గిగా ఫ్యాక్టరీ నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి కేటీఆర్

అమర్ రాజా గిగా ఫ్యాక్టరీ నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి కేటీఆర్

మహబూబ్ నగర్ లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా దివిటిపల్లిలో అమర్ రాజా గిగా ఫ్యాక్టరీ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. వారికి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం  తెలిపారు.

ఐటీ టవర్ ప్రారంభం...

అంతకు ముందు మంత్రి కేటీఆర్ ఐటీ టవర్ ప్రారంభించారు. పెద్ద చెరువు సుందరీకరణ, కేసీఆర్ పార్కులో వాచ్ టవర్ ప్రారంభోత్సవంలో మంత్రులు, జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.  కాసేపట్లో జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారు మాట్లాడనున్నారు.