హైదరాబాద్, వెలుగు: పార్లమెంటులో ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరీ చేసిన వివాదాస్పద కామెం ట్లపై మంత్రి కేటీఆర్ స్పందించారు. లోక్సభలో బీజేపీ ఎంపీ మాటలు, ప్రవర్తన సిగ్గు చేటని.. అలాంటి కామెం ట్లను స్పీకర్ అనుమతించడం అవమా నకరమని తెలిపారు.
ఈ మేరకు ముస్లింలు, ఓబీసీలను దూషిస్తూ రమేశ్ బిధూరీ లోక్సభలో చేసిన కామెంట్లకు సంబంధించిన వీడియో ను తృణమూల్కాంగ్రెస్ఎంపీ మహు వా మోయిత్రా తన ఎక్స్(ట్విట్టర్) అకౌంటులో పోస్ట్చేశారు. దీనిని కేటీఆర్రీ ట్వీట్చేశారు. బీజేపీ ఎంపీ పార్లమెంటులోనే ఇలా మాట్లాడుతు న్నారంటే.. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పరిస్థితిని ఊహించుకుం టేనే వణుకు పుడుతుందని కేటీఆర్ పేర్కొన్నారు.