పార్లమెంటులో బీజేపీ ఎంపీ మాటలు సిగ్గుచేటు: కేటీఆర్

పార్లమెంటులో బీజేపీ ఎంపీ మాటలు సిగ్గుచేటు: కేటీఆర్

హైదరాబాద్, వెలుగు:  పార్లమెంటులో  ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరీ చేసిన వివాదాస్పద కామెం ట్లపై మంత్రి కేటీఆర్ స్పందించారు. లోక్​సభలో  బీజేపీ ఎంపీ మాటలు, ప్రవర్తన సిగ్గు చేటని.. అలాంటి కామెం ట్లను స్పీకర్ అనుమతించడం అవమా నకరమని తెలిపారు. 

ఈ మేరకు ముస్లింలు, ఓబీసీలను దూషిస్తూ  రమేశ్​ బిధూరీ లోక్​సభలో చేసిన కామెంట్లకు సంబంధించిన వీడియో ను  తృణమూల్​కాంగ్రెస్​ఎంపీ మహు వా మోయిత్రా తన ఎక్స్(ట్విట్టర్) అకౌంటులో పోస్ట్​చేశారు. దీనిని కేటీఆర్​రీ ట్వీట్​చేశారు. బీజేపీ ఎంపీ పార్లమెంటులోనే  ఇలా మాట్లాడుతు న్నారంటే.. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో  పరిస్థితిని ఊహించుకుం టేనే వణుకు పుడుతుందని కేటీఆర్ పేర్కొన్నారు.