పేదల ఇండ్ల రిపేర్ కు రూ.100 కోట్లు: మంత్రి కేటీఆర్

పేదల ఇండ్ల రిపేర్ కు రూ.100 కోట్లు: మంత్రి కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ లోని జేఎన్ఎన్ యూఆర్ఎం(జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యూవల్ మిషన్), వాంబే స్కీమ్ కింద పేదలకు అందించిన ఇండ్ల రిపేర్ కోసం ప్రభుత్వం తరఫున రూ.100 కోట్లు కేటాయిస్తూ మంత్రి కేటీఆర్ నిర్ణయం తీసుకున్నారు. హెచ్ఎండీఏ అందించే రూ.100 కోట్ల నిధులతో జీహెచ్ఎంసీ ఈ రిపేర్ పనులను పూర్తిచేయనుంది. 

ఆదివారం మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఓ సమావేశంలో  గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు ఈ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. పేదలు ఉండే కాలనీల్లోని ఇండ్ల కోసం అవసరమైన నిధులను వారు ఖర్చు చేసే అవకాశం లేదని, ఈ నిధులను ప్రభుత్వం అందిస్తే బాగుంటుందని కోరారు.  దీంతో  రిపేర్ల కోసం ఈ నిధులను మంత్రి కేటాయించారు. సిటీలోని జంగంమెట్, బండ్లగూడ లాంటి ఏరియాల్లో జేఎన్ఎన్ యూఆర్ఎం, వాంబే కాలనీలున్నాయి.