ఏరోస్పేస్సెక్టార్లో పెట్టుబడులకు తెలంగాణ బెస్ట్
అమెరికా ఇన్వెస్టర్లతో మంత్రి కేటీఆర్
హైదరాబాద్, వెలుగు : ఏరోస్పేస్డిఫెన్స్సెక్టార్లో పెట్టుబడులకు తెలంగాణ అనుకూలమని మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం ఆయన అమెరికాలో జరిగిన ఇన్వెస్టర్ల రౌండ్టేబుల్ సమావేశంలో మాట్లాడారు. 9 ఏండ్లల్లో ఏరోస్పేస్ రంగంలో తెలంగాణ అద్భుత ప్రగతిని సాధించిందని మంత్రి అన్నారు. 2018, 2020 సంవత్సరాల్లో ఏరోస్పేస్పెట్టుబడులకు సంబంధించి ఉత్తమ అవార్డులు కూడా అందుకున్నామని గుర్తు చేశారు. తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఏరోస్పేస్ డిఫెన్స్ కంపెనీలను కేటీఆర్ కోరారు. అనంతరం వాషింగ్టన్ డీసీలో ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్సంస్థ జాప్కాం ఫౌండర్ సీఈవో కిశోర్పల్లంరెడ్డితో కేటీఆర్సమావేశమయ్యారు.
హైదరాబాద్లో ఎక్సలెన్స్ సెంటర్ఏర్పాటుపై చర్చించారు. కరీంనగర్లో మెడికల్కోడింగ్ సెంటర్ఏర్పాటుకు ఎక్లాట్హెల్త్కేర్ కంపెనీ ముందుకు వచ్చింది. తమ సంస్థ కోడింగ్సెంటర్తో మొదట వంద మందికి ఉద్యోగాలిస్తామని, తర్వాత ఆ సంఖ్యను 200కి పెంచుతామని సంస్థ సీఈవో కార్తీక్ పొలసాని వివరించారు. మంత్రితో సమావేశమైన వారిలో సంస్థ ప్రతినిధులు సందీప్ వాద్వా తదితరులు ఉన్నారు. జీనోం వ్యాలీలో జెనేసిస్ బయో టెక్నాలజీ సంస్థ రూ.60 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. కేటీఆర్తో ఆ సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు.
ఇప్పటికే జీనోమ్ వ్యాలీలోని తమ కంపెనీలో 250 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని, కొత్త పెట్టుబడితో ఇంకో 300 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయన్నారు. అనంతరం వాషింగ్టన్ డీసీలో 30కిపైగా ఐటీ కంపెనీల ప్రతినిధులతో కేటీఆర్ భేటీ అయ్యారు. హైదరాబాద్లోనే కాకుండా రాష్ట్రంలోని వివిధ నగరాలు, పట్టణాలకు ఐటీ ఇండస్ట్రీని విస్తరిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. ఇప్పటికే వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్లో ఐటీ టవర్లను ప్రారంభించామని తెలిపారు. త్వరలోనే సిద్దిపేట, నిజామాబాద్, నల్గొండలో ఐటీ టవర్ల నిర్మాణం పూర్తి కాబోతుందని వెల్లడించారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రం, మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లిలోని ఐటీ కంపెనీలను ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి పేర్కొన్నారు. ఆయా నగరాలు, పట్టణాల్లో తమ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు పలు కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ సమావేశాల్లో టెక్నోజెన్ ఇంక్ సీఈవో లక్స్చేపూరి, బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ అధ్యక్షుడు మహేశ్బిగాల, వంశీరెడ్డి, కార్తీక్, జయేశ్రంజన్, విష్ణువర్ధన్రెడ్డి, అమర్నాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.