కేసీఆర్ మళ్లీ గెలవకపోతే హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన మంత్రి.. బీఆర్ఎస్ పాలనలో పుట్టుక నుంచి చివరి దాక చూసుకునేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు.
గడిచిన పదేళ్లలో హైదరాబాద్ విశ్వనగరంగా ఎదిగిందన్నారు కేటీఆర్. హైదరాబాద్లో ఉంటే అమెరికాలో ఉన్నట్లుందని రజినీకాంత్ అంటే.. హైదరాబాద్లోనే ఇల్లు కొనుక్కోవాలని అనిపిస్తోందని బీజేపీ ఎంపీ సన్ని దేవోల్ అన్నారని కేటీఆర్ గుర్తుచేశారు.
హైదరాబాద్ అభివృద్ది ప్రతిపక్షాలకు మాత్రం కనిపించడం లేదన్నారు మంత్రి కేటీఆర్ . ఎవరో వచ్చి ఏవేవో మాట్లాడుతారని ఆ మాటలు పట్టించుకుంటే ఎక్కడి అభివృద్ధి అక్కడే ఆగిపోతుందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. గతంలో పడిన ఇబ్బందులు, సమస్యలు మళ్లీ మొదలవుతాయని కేటీఆర్ అన్నారు.