- నార్సింగి వద్ద ఇయ్యాల ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: ఔటర్ రింగ్ రోడ్పై నార్సింగి వద్ద రూ.29.50 కోట్లతో నిర్మించిన ఇంటర్ చేంజ్ను శనివారం ఉదయం 10 గంటలకు మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ ఇంటర్ చేంజ్ అందుబాటులోకి వస్తే నార్సింగి, మంచిరేవుల, గండిపేటకు వెళ్లే వారితో పాటు లంగర్ హౌస్, శంకర్ పల్లి ప్రాంతాల నుంచి వచ్చే వారు ఓఆర్ఆర్ మీదుగా జర్నీ చేసేందుకు వీలుంటుంది. దీనివల్ల ఎంతోమంది వాహనదారులకు ఇబ్బందులు తొలగనున్నాయి.
కోకాపేటలో ఎస్టీపీ..
కోకాపేటలో వాటర్బోర్డు నిర్మించిన ఎస్టీపీ(సీవరేజ్ ట్రీట్మెంట్ప్లాంట్)ను మంత్రి కేటీఆర్ ఇయ్యాల ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో వాటర్ బోర్డు ఎండీ దానకిశోర్ శుక్రవారం ఎస్టీపీని సందర్శించారు.ఈ ఎస్టీపీ అందుబాటులోకి వస్తే వట్టినాగులపల్లి, గౌలి దొడ్డి, ఐఎస్బీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చే మురుగును శుద్ధి చేసేందుకు వీలుంటుందన్నారు.