సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై మల్లారెడ్డి పొగడ్తల వర్షం కురిపించారు. రాష్ట్రంలో రామచంద్రుల పాలన నడుస్తోందంటూ.. కేటీఆర్ను రాముడితో, కేసీఆర్ను చంద్రుడితో పోల్చారు. రామరాజ్యం గురించి విన్నాం.. రాముడిని ఫొటోల్లో చూశాం కానీ.. ఇప్పుడు కేటీఆర్ రూపంలో చూస్తున్నామన్నారు. ఈ తారకరాముడు ఐటీ రాజ్యం తెచ్చినట్లు చెప్పారు. రామచంద్రుల పాలనలో యాదాద్రి, సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్మారక కేంద్రం, కమాండ్ కంట్రోల్ సెంటర్, కాళేశ్వరం, మిషన్ భగీరథ వంటి అద్భుతాలు చూస్తున్నామన్నారు. . 28 రాష్ట్రాల్లో కేటీఆర్లాంటి ఐటీ మంత్రి ఎక్కడైనా ఉన్నారా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి వేల కోట్ల నిధులు తెచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. కేటీఆర్ నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. అప్పటి ఉద్యమ చంద్రుడు (కేసీఆర్) ఇవాళ సూర్యుడు అయ్యాడని.. చంద్రుడినే ఎవరు ఆపలేదు ఇప్పుడు సూర్యుడిని ఆపగలరా అని విపక్షాలను అడిగారు. కేసీఆర్ పీఎం అవుతారని.. కేటీఆర్ సీఎం అవుతారని వ్యాఖ్యానించారు.