లాక్ డౌన్ ప్రారంభం నుండి పేద‌ల‌ను ఆదుకుంటున్నాం

లాక్ డౌన్ ప్రారంభం నుండి పేద‌ల‌ను ఆదుకుంటున్నాం

హైద‌రాబాద్: లాక్ డౌన్ ముగిసేవరకు పేదలను ఆదుకోడానికి ముందుంటామన్నారు మంత్రి మల్లారెడ్డి. జవహర్ నగర్ కార్పొరేషన్లోని జయశంకర్ కాలనీలో గురువారం కార్పొరేటర్ శివాజి ఆధ్వ‌ర్యంలో స్థానికంగా నివసిస్తున్న మూడు వేల మంది పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి మల్లారెడ్డి, మేయర్ కావ్య బియ్యం, పప్పు, కూరగాయలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటి నుండి పనులు లేక, తినడానికి తిండి లేక.. ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకోడానికి సిద్దంగా ఉన్నామ‌న్నారు.