ఇంటి దొంగల్ని.. నీళ్ల దొంగల్ని పాతరేస్తాం

ఇంటి దొంగల్ని.. నీళ్ల దొంగల్ని పాతరేస్తాం

ఏపీ జలదోపిడీని అడ్డుకుంటామన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. పాలమూరు ప్రజల హక్కులను కాలరాసే ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వమన్నారు. ఇంటి దొంగల్ని, నీళ్ల దొంగల్ని పాతరేస్తామన్నారు. దాదాగిరీ, గూండాగిరి నడవదని హెచ్చరించారు నిరంజన్ రెడ్డి. తెలంగాణ ప్రయోజనాల కోసం ఎంత దూరమైనా వెళ్తామన్నారు.

కృష్ణా జలాల్లో రాష్ట్రం వాటా వచ్చే వరకు పోరాటం చేయటానికి సిద్ధమన్నారు మంత్రి సబితాఇంద్రారెడ్డి. రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీరు అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి చేవేళ్లకు సాగునీరు ఇవ్వటానికి సర్కార్ కృషిచేస్తుందన్నారు. చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్, తాళ్ళపల్లితీ రైతు వేదికలను ప్రారంభించారు సబిత.