తెలంగాణ రాష్ట్రంలో పక్కా ప్రణాళికతో పల్లెల అభివృద్ధి : మంత్రి నిరంజన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో పక్కా ప్రణాళికతో పల్లెల అభివృద్ధి : మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి, వెలుగు : రాష్ట్రంలోని ప్రతీ పల్లెను పక్కా ప్రణాళికతో డెవలప్​ చేసినట్లు మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. మంగళవారం పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలో పల్లె నిద్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరితహారంలో భాగంగా మొక్కలు పెంచడంతో పాటు ప్రతి గ్రామంలో విలేజ్ పార్కలు ఏర్పాటు చేశామన్నారు.

నియోజకవర్గంలో 60కి పైగా లిఫ్ట్​లు చేపట్టి సాగునీటిని అందిస్తున్నామని చెప్పారు. దీంతో వలసలు తగ్గి, ఇతర ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్లిన వారు తిరిగి వస్తున్నారన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధిరంగాల్లో తొమ్మిదిన్నరేండ్లలో గణనీయమైన ప్రగతి సాధించామని తెలిపారు. తనను గెలిపించాలని కోరారు.