హైదరాబాద్, వెలుగు : టీఎస్ ఈమైనింగ్ మొబైల్ యాప్ ను మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఆవిష్కరించారు. శనివారం సెక్రటేరియేట్లో ఈ కార్యక్రమం జరిగింది. కొత్త యాప్ ద్వారా గనులు, ఇసుక, ఖనిజ రవాణా తనిఖీలు, అక్రమార్కులకు అడ్డుకట్ట వేయవచ్చని మంత్రి తెలిపారు. ఈ - చలాన్ పద్ధతితో జరిమానాలను ఆన్లైన్లో వసూలు చేసేందుకు వీలుంటుందన్నారు.
పారదర్శకత, వెంటనే రుసుము వసూలు చేయడానికి అనుమతులు ఇవ్వవచ్చునని చెప్పారు. యాప్ను రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ, జాతీయ సమాచార విజ్ఞాన కేంద్రం (ఎన్ఐసీ) హైదరాబాద్ సంయుక్తంగా డెవలప్మెంట్చేశారు. కార్యక్రమంలో సీఎస్ శాంతి కుమారి, డీఎంజీ కాత్యాయినీ దేవి పాల్గొన్నారు.