గండిపేట్,వెలుగు: బుద్వేల్ కట్ట మైసమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన ఆదివారం కనుల పండువగా జరిగింది. తెల్లవారుజామున నుంచే పూజలు ప్రారంభించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర గౌడ సంఘం కోశాధికారి హరిచరణ్ గౌడ్ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం మహిళలు బోనాలు సమర్పించారు.
కొడంగల్, వెలుగు:
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలోని పోలేపల్లి శ్రీరేణుక ఎల్లమ్మ అమ్మవారిని బీజేపీ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ దర్శించుకున్నారు. ఆదివారం పోలేపల్లికి చేరుకున్న ఆమెకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఎల్లమ్మ ఆశీస్సులతో మే 13న జరిగే లోక్సభ ఎన్నికలో విజయం తనదేనని ఆమె ధీమా వ్యక్తం చేశారు.