ఎన్టీఆర్ ట్రస్ట్ లక్షలాది మంది.. పేద విద్యార్థులకు విద్య అందిస్తోంది: మంత్రి సీతక్క

ఎన్టీఆర్ ట్రస్ట్ లక్షలాది మంది..  పేద విద్యార్థులకు విద్య అందిస్తోంది: మంత్రి సీతక్క

హైదరాబాద్, వెలుగు: లక్షలాది మంది పేద విద్యార్థులకు విద్యను అందించడంతో పాటు అనాథలకు ఎన్టీఆర్ ట్రస్ట్  ఆశ్రయం కల్పిస్తున్నదని మంత్రి సీతక్క అన్నారు.  శనివారం గండిపేటలో జరిగిన ఎన్టీఆర్ ట్రస్ట్ ఇనిస్టిట్యూట్ యాన్యువల్ డే ఫంక్షన్ కు మంత్రి సీతక్క చీఫ్ గెస్ట్ గా హాజరై మాట్లాడారు. ఎన్టీఆర్ ట్రస్ట్ లో ఫ్రీగా చదివి ప్రస్తుతం ఎంతో మంది ఉన్నత స్థాయిలో ఉన్నారని చెప్పారు. 

ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా నారా భువనేశ్వరి ఎంతో మంది విద్యార్థులకు స్కాలర్ షిప్స్, వేలాది మంది పేదలకు మెడిసిన్స్, బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతో మందికి ఉచితంగా బ్లడ్ అందజేస్తున్నారని పేర్కొన్నారు. 2004 లో టీడీపీతో తన రాజకీయ జీవితం ప్రారంభం అయిందని, ఈ స్కూల్ తో తనకు 20 ఏండ్లుగా అనుబంధం ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి, ట్రస్ట్ సీఈవో రాజేంద్ర కుమార్​ తదితరులు పాల్గొన్నారు.