
హైదరాబాద్, వెలుగు: ఓట్ల కోసం చస్తా అనే నాలెడ్జ్తనకు లేదని మంత్రి సీతక్క అన్నారు. సోమవారం అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి మాట్లాడుతూ.. ‘గత బీఆర్ఎస్ప్రభుత్వంలో ట్రాన్స్పోర్ట్లో ఉన్న సుమారు పది లక్షల మంది డ్రైవర్లకు రూ.5లక్షల ఇన్సూరెన్స్ చేశామని.. ఈ అంశంపై మంత్రి సీతక్కకు నాలెడ్జ్లేకపోవచ్చు’ అని పేర్కొన్నారు. దీంతో కౌశిక్రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఫైర్అయ్యారు. మహిళల పట్ల దురహంకారంగా మాట్లాడే నాలెడ్జ్ తనకు లేదని, ఓట్ల కోసం చస్తా అనే నాలెడ్జ్తనకు లేదని కౌంటర్ఇచ్చారు. అలాగే, ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టడం కాదని, మహిళలకు ఫ్రీ బస్సుపై వారి వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. మహిళా మంత్రి అంటే అంత చులకన ఎందుకని ప్రశ్నించారు. ‘తాగింది, తూలింది కేసీఆర్ పాలనలోనే.. బూడిద రాజకీయం, లిక్కర్ రాజకీయం కరెక్ట్ కాదు’ అని అన్నారు. అనంతరం మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ.. ‘మహిళా మంత్రిని నాలెడ్జ్ లేదని మాట్లాడడం సరికాదు.. తప్పును ఒప్పుకుని క్షమాపణ చెప్పాలి. సభా గౌరవం ఎలా కాపాడాలి.. సభలో ఏ విధంగా మాట్లాడాలనేది అనుభవం ఉన్న కేటీఆర్, గోపీనాథ్, సబిత లాంటి వాళ్లు కొత్తగా వచ్చిన సభ్యులకు చెప్పాలి’ అని సూచించారు.
ఇది అడియాశల బడ్జెట్: కౌశిక్రెడ్డి
ఆటో డ్రైవర్లకు రూ.12వేలు ఇస్తమని మేనిఫెస్టో లో పెట్టి బడ్జెట్లో నిధులు కేటాయించలేదని.. ఇది అడియాశల బడ్జెట్అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. ఫ్రీ బస్సులు వచ్చినప్పటి నుంచి 59మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని, ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని అన్నారు. అలాగే, బస్సుల సంఖ్య పెంచాలన్నారు. ఫ్లై యాష్ పై ఆరోపణలు చేస్తూ ఓవర్ లోడ్ వల్ల రోడ్లు ధ్వంసం అవుతున్నాయన్నారు. మధ్యప్రదేశ్లో బ్లాక్ లిస్ట్ లో పెట్టినబీర్ల కంపెనీకి ఇక్కడ పర్మిషన్ ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. తాగండి ఊగండి ఖజానా నింపండి అన్నట్టు సర్కారు తీరు ఉందన్నారు. దీంతో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో విచ్చలవిడిగా జరిగిన ఇసుక దందాపై విచారణ జరిపించాలన్నారు. కౌశిక్ రెడ్డి సీఎంను ఏకవచనంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ మాట్లాడుతూ.. పవర్ ప్లాంట్ల నుంచి వచ్చే ఫ్లై యాష్ ను గత ప్రభుత్వ హయాంలో వేల లారీల్లో తీసుకెళ్లారని చెప్పారు. వందల కోట్ల స్కామ్జరిగిందని, అది మాట్లాడితే బాగుండని అన్నారు. ఓవర్లోడ్ పైనిర్ణయం తీసుకుంటామని చెప్పారు.