యాదాద్రి, వెలుగు: రాజకీయాల్లో కింగ్లు ఎంత ముఖ్యమో.. కింగ్మేకర్లు అంతే ముఖ్యమని మంత్రి సీతక్క అన్నారు. టికెట్వచ్చిన వాళ్లు కింగ్లు అయితే.. వారిని గెలిపించడానికి పనిచేసేవారు కింగ్ మేకర్లని తెలిపారు. మున్సిపల్ ఎన్నికలపై యాదాద్రి జిల్లా భువనగిరిలో నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల మీటింగ్లో ఆమె మాట్లాడారు. పార్టీ కోసం కష్టపడిన వారికే టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. టికెట్ఎవరికి వచ్చినా అందరూ సమన్వయంతో పని చేస్తే మున్సిపల్ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తామన్నారు.
గెలుపుపై అతి విశ్వాసం వద్దని, ప్రణాళికాబద్దంగా ప్రతి ఓటరును కలవాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్స్ను ప్రజలకు వివరించాలని సూచించారు. పోటీ చేసే అవకాశం రాని వారిని పార్టీ గుర్తు పెట్టుకుంటుందని, నామినేటేడ్ పదవుల భర్తీ విషయంలో స్థానం కల్పిస్తామని చెప్పారు. సొసైటీలో లేకుండా కేవలం సోషల్ మీడియాలో ఉంటూ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ను తిప్పికొట్టాలని మంత్రి పిలుపునిచ్చారు. సమావేశంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి, భువనగిరి, తుంగతుర్తి ఎమ్మెల్యేలు కుంభం అనిల్కుమార్ రెడ్డి, మందుల సామెల్ ఉన్నారు.
