పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం : మంత్రి సీతక్క

పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం :  మంత్రి సీతక్క

ములుగు/ ఏటూరునాగారం, వెలుగు : ప్రజా ప్రభుత్వ పాలనలో అందరికీ పథకాలు చేరువ అయ్యేందుకు కృషి చేస్తున్నామని పంచాయతీ రాజ్​ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం ములుగు క్యాంపు ఆఫీస్​లో 48మంది లబ్ధిదారులకు రూ.63 లక్షల విలువగల సీఎం రిలీఫ్​ ఫండ్​చెక్కులను మంత్రి అందజేశారు. అనంతరం ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లి తుమ్మ కోమల–సాయిరెడ్డి దంపతులు, వారి మనుమడు తుమ్మ జయసింహారెడ్డి జ్ఞాపకార్థం ఉచిత మెగా స్పెషాలిటీ హెల్త్​ క్యాంప్​ను వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేయగా, మంత్రి సీతక్క ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో పేదలకు సేవ చేయాలని తల్లిదండ్రులు, కొడుకు జ్ఞాపకార్థం తుమ్మ ప్రభాకర్​రెడ్డి, తుమ్మ శ్రీధర్​రెడ్డి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. కాళోజీ నారాయణరావు హెల్త్​ యూనివర్సిటీ జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్త్​ క్యాంప్​లో మంత్రి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్​ చెక్కులను అందజేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు నోట్​బుక్స్​పంపిణీ చేశారు.