భూ నిర్వాసితుల సమస్యలపై ఎందుకు మాట్లాడలే: మంత్రి శ్రీధర్ బాబు

భూ నిర్వాసితుల సమస్యలపై ఎందుకు మాట్లాడలే: మంత్రి శ్రీధర్ బాబు
  • కాళేశ్వరం నష్టానికి కేసీఆర్ జవాబు చెప్పాలి
  • ప్రాజెక్టు రక్షణపై ఇంజినీర్ల సూచనలతో ముందుకు

 హైదరాబాద్​: రాజకీయంగా కాంగ్రెస్​ ప్రభుత్వంపై బురదజల్లేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వెళ్లాయని  మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా  మంథనిలో గృహజ్యోతి  జీరో విద్యుత్ బిల్లును మంత్రి పంపిణీ చేసి మాట్లాడుతూ ప్రాజెక్ట్ సందర్శనలో కనీసం భూ నిర్వాసితుల సమస్యలపై ఎందుకు మాట్లాడలేదన్నారు. మేడిగడ్డ నష్టానికి కేసీఆర్  సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు. అధికారంలో ఉండగా  కాళేశ్వరం ప్రాజెక్ట్ రక్షణ, మరమ్మత్తుల కోసం చర్యలు ఎందుకు చేపట్టలేదో కేటీఆర్ ప్రజలకు చెప్పాలన్నారు. ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందలేన్నారు. ప్రాజెక్ట్  రక్షణ చర్యలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఇంజినీర్ల సూచనలతో ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు.  విడతల వారీగా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు. మంథని వద్ద రెండు జిల్లాలో పరిధిలో గోదావరిపై బ్రిడ్డి నిర్మిస్తున్నామన్నారు.