హైదరాబాద్, వెలుగు: మంత్రి శ్రీనివాస్ గౌడ్ గురువారం సీఎం కేసీఆర్ను ప్రగతి భవన్లో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాను ప్రత్యేకంగా రూపొందించి ముద్రించిన పాలమూరు ప్రగతి నివేదిక పుస్తకాన్ని సీఎంకు అందజేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధి పై సమగ్ర సమాచారంతో కూడిన పుస్తకాన్ని చూసి సీఎం హర్షం వ్యక్తం చేశారు.
పాలమూరులో జరుగుతున్న అభివృద్ధిని శాఖల వారీగా, ఆకర్షణీయమైన ఫొటోలను పొందుపరిచి సాధికారిక సమాచారంతో శ్రీనివాస్ గౌడ్ పుస్తకాన్ని రూపొందించడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఈ భవిష్యత్తులో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మరింతగా అభివృద్ధి చెందేలా సమష్టి కృషి కొనసాగాలని సీఎం ఆకాంక్షించారు.