బోనాలను సంబురంగా జరుపుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ నెల 16 నుంచి లాల్ దర్వాజ బోనాలు మొదలు కానుండగా.. వీటి నిర్వహణ కోసం 358 ఆలయాల ఇన్ చార్జిలకు రూ.2 కోట్ల 13 లక్షలను మంగళవారం బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కమిషనర్ ఆఫీసులో మంత్రి అందజేశారు. ఆయన వెంట ఎమ్మెల్యే రాజాసింగ్ ఉన్నారు. మరోవైపు సిటీలో పలుచోట్ల బోనాల ఉత్సవాలు కొనసాగుతున్నాయి.
చిక్కడపల్లిలోని సిటీ లైబ్రరీలో, కొంగరకలాన్ లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో జరిగిన బోనాల వేడుకల్లో కలెక్టర్ హరీశ్ దంపతులు, డీఆర్వో హరిప్రియ పాల్గొన్నారు. మధురానగర్ లోని శ్రీ బంగారు మైసమ్మ అమ్మవారు మంగళవారం శాకంబరీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. – వెలుగు, బషీర్ బాగ్/పద్మారావునగర్/రంగారెడ్డి కలెక్టరేట్