- పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై హరీశ్వి వికారపు మాటలు: మంత్రి ఉత్తమ్
- 17 లక్షల క్యూబిక్ మీటర్ల ఎర్త్ పనులు, 7 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వర్క్స్ పూర్తిచేసినం
- కేసీఆర్ హయాంలో పూర్తయింది ఒక్క పంపే
- మేం వచ్చాక మరో 11 పంపులను పూర్తి చేసినం.. త్వరలోనే ప్రారంభిస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుపై హరీశ్రావు విచిత్ర, వికారపు మాటలు మాట్లాడుతున్నారని ఇరిగేషన్శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. కమీషన్ల విషయంలో హరీశ్ రావులాగానే అందరూ ఉంటారని అనుకోవడం పొరపాటన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు ఖర్చు చేసిన రూ.7 వేల కోట్లలో ప్రతి రూపాయికీ లెక్క చెప్తామన్నారు. కమీషన్లు ఆయనకు అలవాటేమోగానీ.. తనకు కాదన్నారు. ఆయన అలవాట్లే అందరికీ ఉంటాయనుకోవద్దన్నారు. పాత జ్ఞాపకాలేమైనా హరీశ్కు ఉన్నాయేమోనని ఎద్దేవా చేశారు.
తాము చాలా సిన్సియర్గా, కమిటెడ్గా, రాష్ట్రానికి మేలు చేసేలా పనిచేస్తున్నామని చెప్పారు. ఇంటర్స్టేట్ఇష్యూస్ సహా ఇరిగేషన్ శాఖను బీఆర్ఎస్ ఖతం పట్టించిందని విమర్శించారు. అసెంబ్లీలో పవర్పాయింట్ ప్రజెంటేషన్కు అవకాశమిస్తే ఏం చెప్తారని ఉత్తమ్ప్రశ్నించారు. కృష్ణా నీళ్లన్నీ ఆంధ్రకే ఇచ్చి వచ్చామని చెబుతారా? అని మండిపడ్డారు.
మంగళవారం ఆయన సెక్రటేరియెట్లో మీడియాతో మాట్లాడారు. పాలమూరు ప్రాజెక్టుకు బీఆర్ఎస్ప్రభుత్వం రూ.27 వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకూ నీళ్లివ్వలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టు ఖర్చును రూ.55,088 కోట్లకు పెంచారని, సీడబ్ల్యూసీకి సమర్పించిన డీపీఆర్లోనే ఆ అంశాన్ని పేర్కొన్నారని గుర్తుచేశారు. అయితే, అందులో డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్, భూసేకరణ, పరిహారం ఖర్చును మెన్షన్ చేయలేదని, ఆ తర్వాత రివైజ్డ్ డీపీఆర్లో వాటికి మరో రూ.3 వేల కోట్లుగా పేర్కొన్నారని చెప్పారు.
ఇప్పుడు ఇంకా 30 వేల ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందని, ఇప్పుడున్న ధరలతో డిస్ట్రిబ్యూటరీలు, భూసేకరణ, పరిహారానికే రూ.6 వేల కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. ఇప్పటివరకు బీఆర్ఎస్ వాళ్లు డిస్ట్రిబ్యూటరీలు నిర్మించలేదని, తట్టెడు మట్టి తీయలేదన్నారు. వాళ్లు ఇప్పటివరకు పూర్తి చేసింది 35 శాతం పనులేనని.. కానీ, 90 శాతం పూర్తి చేశామని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.
చాలా పనులు చేసినం
పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు రెండేండ్లలో రూ.7 వేల కోట్లు పెట్టి పనులు చేశామని మంత్రి ఉత్తమ్ చెప్పారు. 17 లక్షల క్యూబిక్ మీటర్ల ఎర్త్ వర్క్, 7 లక్షల క్యూబిక్మీటర్ల కాంక్రీట్వర్క్చేశామని తెలిపారు. 9 కిలో మీటర్ల మేర ప్రెజర్మెయిన్స్ పనులు చేసినట్టు చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ఒకే ఒక పంప్ను పూర్తి చేశారని.. కానీ, కాంగ్రెస్ వచ్చాక మరో 11 పంపులను పూర్తి చేశామని, అవి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ‘‘ప్రాజెక్టుకు అన్ని అనుమతులు పొందామని కేసీఆర్అంటున్నారు. కానీ, దానికి హైడ్రాలజీ (నీటి కేటాయింపులు) అనుమతి లేదు. ఎన్విరాన్మెంట్క్లియరెన్స్లేదు. ఇరిగేషన్ ప్లానింగ్, బెనిఫిట్ కాస్ట్రేషియో, అంతర్రాష్ట్ర అనుమతులు లేవు. మరి, వాళ్లు ఏ లెక్కన అనుమతులు తెచ్చినం అని చెప్తున్నారు?”అని ఉత్తమ్ప్రశ్నించారు.
వాటిని నిర్లక్ష్యం చేసిన్రు
బీఆర్ఎస్ పదేండ్ల హయాంలో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని ఉత్తమ్ ఆరోపించారు. వాటిని తమ ప్రభుత్వంలోనే పూర్తి చేస్తామన్నారు. ‘‘ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల మీద అంత పగ ఎందుకు? వాటిని కాదని కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎందుకంత ప్రేమ?’’ అని ఆయన మండిపడ్డారు.
నాడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులను స్లో చేయాలని 2020లోనే బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు అప్పటి ఈఎన్సీని ఆదేశించారన్నారు. దీంతో ప్రాజెక్ట్ ఇంజనీర్లకు ఈఎన్సీ కూడా ఆదేశాలిచ్చారని, తద్వారా పెద్ద కుట్రకు తెరదీశారని మండిపడ్డారు. ప్రాజెక్టు లిఫ్టింగ్ కెపాసిటీని ఒక్క టీఎంసీకి తగ్గించాలంటూ 2020 ఏప్రిల్ 8న నాటి ఈఎన్సీ మురళీధర్ ఉత్తర్వులిచ్చారని గుర్తు చేశారు.
తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు అత్యధిక జలాలను తమ హయాంలోనే వినియోగించామని.. 288 టీఎంసీలు వాడామని చెప్పారు. పదేండ్లు తాత్కాలిక ఒప్పందం ప్రకారం 33:64 వాటాకు ఒప్పుకోవడమే కాకుండా.. బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయింపులు అయ్యేదాకా అదే వాటాకూ కేసీఆర్ ఒప్పుకున్నారని మండిపడ్డారు. కానీ, తాము అధికారంలోకి వచ్చాక క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం 70 శాతం నీళ్లు మనకే రావాలని ట్రిబ్యునల్లో పోరాడుతున్నామన్నారు.
