
హైదరాబాద్, వెలుగు: హుజూర్నగర్లో ఈ నెల 25న మెగా జాబ్మేళాను నిర్వహించనున్నట్టు ఇరిగేషన్, సివిల్సప్లైస్శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు. ఈ మెగా జాబ్మేళాలో 150 కంపెనీలు భాగమవుతాయని, 10 వేల మందికిపైగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు జాబ్మేళాను నిర్వహిస్తున్నామని చెప్పారు. మంగళవారం ఆయన సెక్రటేరియెట్లో డిజిటల్ఎంప్లాయ్మెంట్ఎక్స్చేంజ్అధికారులతో కలిసి ఆయన మెగా జాబ్మేళా వాల్పేపర్ను ఆవిష్కరించారు.
దీనిని ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభిస్తారని ఉత్తమ్చెప్పారు. ఐటీ, మాన్యుఫ్యాక్చరింగ్, సర్వీసెస్, ట్రేడింగ్, ఫార్మా, బ్యాంకింగ్ సహా వివిధ రంగాలకు చెందిన కంపెనీలు పాల్గొంటాయని వెల్లడించారు. నిరుద్యోగుల కోసం జాబ్మేళా జరిగే చోట హెల్ప్డెస్క్తో పాటు ఆన్లైన్లోను సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. అవసరమైన చోట కంప్యూటర్లు, ప్రింటర్లు, జిరాక్స్ మిషన్ లు ఏర్పాటు చేయలని డీట్ అధికారులకు ఆయన సూచించారు.