రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి : మంత్రి వివేక్ వెంకటస్వామి

రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి : మంత్రి వివేక్ వెంకటస్వామి
  • గడి మైసమ్మ తల్లికి మంత్రి వివేక్​ వెంకటస్వామి పూజలు

కోల్​బెల్ట్/ చెన్నూరు, వెలుగు: గడి మైసమ్మ తల్లి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ ​వెంకటస్వామి అన్నారు. బుధవారం చెన్నూరు పట్టణ కేంద్రంలోని గడిమైసమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మంత్రిని శాలువాతో సన్మానించారు. మంత్రి వెంట స్థానిక కాంగ్రెస్​ లీడర్లు ఉన్నారు.

ఏసీపీ కుటుంబానికి పరామర్శ

పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ కుటుంబాన్ని మంత్రి వివేక్​పరామర్శించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో ఏసీపీ కృష్ణ తండ్రి ఐలయ్య మృతిచెందగా జైపూర్​మండలం రసూల్​పల్లిలోని ఏసీపీ ఇంటికి మంత్రి వెళ్లారు. ఐలయ్య ఫొటోకు నివాళులర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించి సానుభూతి తెలియజేశారు.