కాంగ్రెస్తోనే గ్రామాల అభివృద్ధి..పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే నిధులు : మంత్రి వివేక్వెంకటస్వామి

కాంగ్రెస్తోనే గ్రామాల అభివృద్ధి..పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే నిధులు : మంత్రి వివేక్వెంకటస్వామి
  • రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్​వెంకటస్వామి
  • కోటపల్లి, చెన్నూరు మండలాల్లో మంత్రి విస్తృత ప్రచారం 

కోల్​బెల్ట్, వెలుగు: పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్​ పార్టీ బలపరిచిన సర్పంచ్​అభ్యర్థులను గెలిపించుకుంటేనే గ్రామాలాభివృద్ధి సాధ్యమని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి అన్నారు. చెన్నూరు నియోకవర్గంలోని కోటపల్లి, చెన్నూరు మండలాల పంచాయతీ అభ్యర్థుల తరఫున ఆదివారం మంత్రి విస్తృత ప్రచారం చేశారు. 

మంత్రి వెంట మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్​ కుమార్, డీసీసీ ప్రెసిడెంట్ పిన్నింటి రఘునాథ్​ రెడ్డి, రాష్ట్ర లీడర్​ బండి సదానందం యాదవ్​పాల్గొన్నారు. కాంగ్రెస్​బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులందరినీ భారీ మెజారిటీతో గెలిపిస్తే సీఎం రేవంత్​ రెడ్డి వద్దకు వెళ్లి ఎక్కువ నిధులు తీసుకొస్తానని మంత్రి హామీ ఇచ్చారు. పంచాయతీలను అభివృద్ది పథంలో నిలిపేందుకు సమష్టి కృషి చేస్తామన్నారు. 

కోటపల్లి మండలం కొడంపేట, మల్లంపేట, కోటపల్లి, సర్వాయిపేట, రాపన్​పల్లి, అన్నారం, బబ్బెర చెలక, దేవులవాడ, పారుపెల్లి, సిర్సా గ్రామ పంచాయతీల సర్పంచ్ అభ్యర్థులు ఆరె వెంకటమ్మ, తాళ్ల వెంకటమ్మ, అలూరి సంపత్, బన్సీనాయక్, అట్టెల లస్మయ్య, దుర్గం శంకరమ్మ, మూల ప్రదీప్​ రెడ్డి, దుర్గం సమ్మక్క, తాండ్ర సరేశ్, గొడిసెల వైజయంతికి మద్దతుగా మంత్రి ప్రచారం చేశారు. పలు పంచాయతీల్లో బోర్ల నిర్మాణానికి హామీ ఇచ్చారు. 

ఎస్టీ భవన్​కు రూ.20 లక్షల ఫండ్స్ మంజూరు చేస్తానన్నారు. అంతకుముందు జైపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ బలపరుస్తున్న జైపూర్ సర్పంచ్ అభ్యర్థి కూన భాస్కర్​కు మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి మనుబోతుల సమ్మయ్య, ఆయన అనుచరులు కాంగ్రెస్​లో చేరగా వారికి మంత్రి వివేక్ కండువాలు కప్పి ఆహ్వానించారు. చెన్నూరు మండలం కిష్టంపేట, సుద్దాల, కత్తెరసాల గ్రామ సర్పంచ్ అభ్యర్థులు దుర్గం లక్ష్మి, మాదాసు రమాదేవి, రామగిరి సునీతకు మద్దతుగా ప్రచారం చేశారు. మంత్రి వెంట జైపూర్ ఎన్నికల ఇన్​చార్జ్ గాండ్ల సమ్మయ్య, అబ్దుల్​ అజీజ్, లీడర్లు, కార్యకర్తలు ఉన్నారు.