నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి

నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్: జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికలో కాంగ్రెస్​ అభ్యర్థి నవీన్​ యాదవ్​ ను గెలిపించుకోవాలని ఓటర్లను మంత్రి వివేక్​ వెంకటస్వామి కోరారు. శుక్రవారం (నవంబర్​7)సాయంత్రం ఓటర్లు, కార్యకర్తలతో సమావేశం అయిన మంత్రి.. నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్​ గెలుపుతో నే అభివృద్ది జరుగుతుందన్నారు. గత పదేండ్లలో బీఆర్​ ఎస్​ ప్రభుతవం  ఎలాంటి అభివౄద్ధి పనులు చేయలేదన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చాక జూబ్లీహిల్స్​ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే 70 శాతం పనులు జరుగుతున్నాయన్నారు.  నవీన్​ యాదవ్​ ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటే  నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందన్నారు. 

రాష్ట్రంలో బీఆర్​ ఎస్​ , బీజేపీ ఒక్కటయ్యాయని ఆరోపించారు మంత్రి వివేక్​ వెంటకస్వామి. కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వైరీ వేశాం.. ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు.. బీఆర్​ఎస్​, బీజేపీ చీకటి ఒప్పందం వల్లే అరెస్ట్​ కావాల్సిన బీఆర్​ఎస్​ నేతలు బయట తిరుగుతున్నారని విమర్శించారు. గతంలో బీఆర్​ ఎస్​ ప్రభుత్వం మాపై ఈడీ కేసులు పెట్టించింది. అయినా మేం లెక్కచేయలేదు. ఎన్నికల్లో హామీలు గుప్పించిన బీఆర్​ ఎస్​ ఒక్కటికూడా నెరవేర్చలేదు.. జూబ్లీహిల్స్​ ప్రచారంలో కూడా ప్రజలను మభ్యపెట్టేందుకు చూస్తోంది.కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి వివేక్​ వెంకటస్వామి కోరారు.