
ధర్మారం, వెలుగు: ధర్మారం మండలం కటికేనపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కుటుంబాన్ని మైనింగ్, కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి బుధవారం పరామర్శించారు. మాజీ సర్పంచ్ బోనగిరి పెద్దులు భార్య బోనగిరి లక్ష్మీ గతవారం అనారోగ్యంతో చనిపోయారు.
బుధవారం గ్రామంలోని బాధితుల ఇంటికి వెళ్లి లక్ష్మి ఫొటో వద్ద నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కాడే సూర్యనారాయణ, కోమటిరెడ్డి రవీందర్ రెడ్డి, పాలకుర్తి రాజేశంగౌడ్, పొన్నం కృష్ణ, సంపత్ పాల్గొన్నారు.