V6 News

సంక్షేమానికి నిరంతర కృషి  : మంత్రి వివేక్ వెంకటస్వామి 

సంక్షేమానికి నిరంతర కృషి  : మంత్రి వివేక్ వెంకటస్వామి 

కోల్​బెల్ట్​,వెలుగు:  ప్రజాసంక్షేమానికి తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మంత్రి వివేక్​ వెంకటస్వామి అన్నారు.    మందమర్రిలోని బీ1 ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్​లో   125 మంది లబ్దిదారులకు రూ.1,25,14,500 విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కులను   అందజేశారు. మంత్రి వెంట మందమర్రి తహసీల్దార్​ సతీశ్​కుమార్​,స్థానిక కాంగ్రెస్​ లీడర్లు పాల్గొన్నారు. రామకృష్ణాపూర్​కు చెందిన పాలరాజయ్య నూతన గృహాన్ని మంత్రి సందర్శించారు.

అనంతరం ఇటీవల అనారోగ్యంతో చిర్రకుంట మాజీ సర్పంచ్​, సీనియర్​ కాంగ్రెస్​ లీడర్​ ఓడ్నాల కొమురయ్య,క్యాతనపల్లి మున్సిపాలిటీలో నాగార్జున కాలనీకి చెందిన కాంగ్రెస్​ మహిళ లీడర్ సృజన తల్లి తార మృతిచెందగా బాధిత కుటుంబాలను మంత్రి పరామర్శించారు.ఆపరేషన్​ చేసుకున్న ఐఎన్టీయూసీ సీనియర్​ లీడర్​ యమహా శ్రీనివాస్ కలిసిన మంత్రి ఆయన ఆరోగ్య,యోగక్షేమాలను అడిగితెలుసుకున్నారు.