బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి శ్రీహరి కన్నుమూత

బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి శ్రీహరి కన్నుమూత
  • నివాళులర్పించిన మంత్రులు పొన్నం, అడ్లూరి

కోహెడ, వెలుగు: మండలంలోని శనిగరం గ్రామానికి చెందిన కర్ర శ్రీహరి(83) కన్నుమూశారు. కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హాస్పిటల్​లో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన శ్రీహరి మొదట సర్పంచ్​గా, ఎంపీపీ, జడ్పీటీసీ, సింగిల్​ విండో  చైర్మన్​గా పని చేశారు. నేటి హుస్నాబాద్​ నియోజకవర్గంలోని నాటి ఇందుర్తి నియోజకవర్గం టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 

తర్వాత టీఆర్​ఎస్​లో చేరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం రాష్ర్ట కార్యదర్శిగా ఉన్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్​కుమార్​ శ్రీహరి పార్థివ దేహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. మాజీ మంత్రులు తన్నీరు హరీశ్​రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, మాజీ ఎంపీ వినోద్​ కుమార్, దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీశ్ కుమార్, పుట్ట మధు, కొరుకంటి చందర్, జీవీ రామకృష్ణ, దేవిశెట్టి శ్రీనివాస్​రావు, మాజీ ప్రజా ప్రతినిధులు నివాళులర్పించారు.