వెలుగులు విరజిమ్ముతూ సాగిన 'నేతాజీ డ్రోన్ షో'

  వెలుగులు విరజిమ్ముతూ సాగిన 'నేతాజీ డ్రోన్ షో'

ఇండియా గేట్ దగ్గర నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం, వారసత్వాన్ని తెలిపే డ్రోన్ షో జరిగింది. కాంతులు విజిమ్ముతూ డ్రోన్ విన్యాసాలు అత్యంత అట్టహాసంగా జరిగాయి. ఇక్కడే ప్రధాని మోడీ కొత్తగా నేతాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ ఉత్సవాల్లో దశలవారీగా రివ్వున ఆకాశంలోకి ఎగిరిన ఈ డ్రోన్లు లేజర్‌ వెలుగుల్ని విరజిమ్ముతూ నేతాజీ చిత్రంగా ఏర్పడటం కన్నులవిందు చేసింది.

ఈ మొత్తం కార్యక్రమంలో 250 డ్రోన్లు పాల్గొన్నాయని కేంద్ర సాంస్కృతిక శాఖ తెలిపింది. రాత్రి 8.35 నిమిషాలకు ప్రారంభమైన డ్రోన్ విన్యాసాలు 10 నిమిషాల పాటు సాగాయి. వాటిని స్థానికులు తమ సెల్ ఫోన్లలో షూట్ చేసి, సోషల్ మీడియాల్లో పంచుకుంటున్నారు.