నాటు తుపాకీతో బెదిరించి 15 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్

నాటు తుపాకీతో బెదిరించి 15 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్

15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు ఐదుగురు యువకులు. అక్కడి నుంచి బయటపడ్డ ఆ బాలిక..సాయం కోరుతూ ఓ కారును ఆపింది. కారులోని ఇద్దరూ కూడా బాలికను రేప్ చేశారు. ఇలా ఒకేరోజు బాలికపై 2 గ్రూపులు రేప్ చేశాయి. ఈ దారుణ సంఘటన హర్యాణాలోని పున్హానాలో జూలై-30న జరుగగా ఆలస్యంగా తెలిసింది.

పున్హానాలో నివాసముండే ఐదుగురు యువకులు జూలై-30న బాలికను కిడ్నాప్‌ చేసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ సామూహికంగా అత్యాచారం చేసి, దీని గురించి ఎవరికీ చెప్పొద్దని నాటు తుపాకీతో బెదిరించి వెళ్లిపోయారు. ఇంతలో అటు వైపు వచ్చిన ఓ కారును ఆపి, తనను ఇంటి దగ్గర దింపమని వేడుకోగా, అందులో ఉన్న ఇద్దరు కూడా అత్యాచారానికి పాల్పడ్డట్లు బాలిక వాపోయింది.

మొదట ఈ విషయం గురించి తల్లిదండ్రులకు చెప్పేందుకు బాలిక భయపడ్డా.. తర్వాత తండ్రికి జరిగిన విషయం చెప్పినట్లు తెలిపారు పోలీసులు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకొనేందుకు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు. నిందితులపై పోక్సో చట్టం సహా.. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.