పదకొండేళ్ల బాలికపై అత్యాచారం

పదకొండేళ్ల బాలికపై అత్యాచారం
  • యూపీలో దారుణం

లక్నో: యూపీలో పదకొండేండ్ల బాలికపై ఓ దుండగుగు అత్యాచారానికి పాల్పడ్డాడు. శనివారం సాయంత్రం సీతాపూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన వివరాలు పోలీసులు ఆదివారం మీడియాకు తెలిపారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించామని జిల్లా ఎస్పీ ఎల్ ఆర్ కుమార్ తెలిపారు. బాలిక గ్రామానికే చెందిన నిందితుడు అత్యాచారానికి పాల్పడి పరారయ్యాడని, త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. ఐపీసీ, ఫోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని చెప్పారు. బాలిక కండిషన్ స్థిరంగా ఉందన్నారు.