బాలికపై అత్యాచారం కేసులో.. ఇద్దరు మైనర్లు అరెస్ట్

బాలికపై అత్యాచారం కేసులో.. ఇద్దరు మైనర్లు అరెస్ట్

ఘట్ కేసర్, వెలుగు: బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ మైనర్ ను, అతడికి సహకరించిన ఫ్రెండ్ ను ఘట్ కేసర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ మహేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..  ఘట్ కేసర్ కు చెందిన ఓ మైనర్(17) ప్రేమ పేరుతో  నాగారం మున్సిపాలిటీకి చెందిన ఓ బాలిక(15) వెంటపడేవాడు. పెండ్లి చేసుకుంటానని బాలికకు మాయమాటలు చెప్పి బుధవారం రాత్రి తన ఫ్రెండ్(17) ఇంటికి తీసుకెళ్లాడు.

అక్కడ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. గురువారం ఉదయం వారు ఘట్ కేసర్ పీఎస్ లో కంప్లయింట్ చేశారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డ మైనర్ తో పాటు అతడికి సహకరించిన ఫ్రెండ్ ను పోలీసులు అరెస్ట్ చేసి జువైనల్ హోమ్ కు తరలించారు.