- మున్సిపల్ మాజీ చైర్మన్,కౌన్సిలర్, మరికొందరు లీడర్లు..
- రఘువీర్రెడ్డిని గెలిపిస్తామని ప్రకటన
మిర్యాలగూడ, వెలుగు : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రోడ్షో ఈ నెల 24న మిర్యాలగూడలో నిర్వహించనున్న నేపథ్యంలో ఆ పార్టీకి షాక్ తగిలింది. తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు మిర్యాలగూడ మున్సిపల్ మాజీ చైర్మన్, ప్రస్తుత కౌన్సిలర్, మరికొందరు పార్టీ లీడర్లు ప్రకటించారు. సోమవారం మీడియా సమావేశంలో మిర్యాలగూడ మున్సిపల్ మాజీ చైర్మన్ గార్లపాటి నిరంజన్ రెడ్డి, 25వ వార్డు కౌన్సిలర్ వంగాల నిరంజన్ రెడ్డి, మిర్యాలగూడ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, మైనార్టీ బీఆర్ఎస్ జిల్లా సీనియర్ లీడర్ ఎండీ మదర్ బాబా రిజైన్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఎన్నికల్లో కాంగ్రెస్అభ్యర్థి రఘువీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామన్నారు. రానున్న కొద్ది రోజుల్లో మరిన్ని చేరికలుంటాయన్నారు. నీటి సంఘాల మాజీ చైర్మన్ గార్లపాటి శ్రీనివాస్ రెడ్డి, మునీర్, గౌస్ ఖాన్, తులసి, జావేద్ ఉన్నారు.