టీఆర్ఎస్‌‌కు ఓటెయ్యకుంటే  దేవుడే శిక్షిస్తడు

టీఆర్ఎస్‌‌కు ఓటెయ్యకుంటే  దేవుడే శిక్షిస్తడు

హాలియా, వెలుగు: సంక్షేమ పథకాలతో లబ్ధి పొందిన ఓటర్లు నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు ఓటు వెయ్యకుంటే, వారిని దేవుడే శిక్షిస్తాడని మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్​రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నిడమనూరు మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీలకు ఓటేస్తే, అభివృద్ధి ఏమీ జరగదన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే టీఆర్ఎస్​కే ఓటు వెయ్యాలన్నారు. పోయిన ఎన్నికల్లో తనకు 31 వేల మెజార్టీ వచ్చిందంటే, అదంతా కేసీఆర్ గొప్పతనమేనని అన్నారు.