చెక్​ డ్యాం పేల్చేందుకు యత్నం.. అడ్డుకున్న రైతులు.. దుండగులు పరార్

చెక్​ డ్యాం పేల్చేందుకు యత్నం.. అడ్డుకున్న రైతులు.. దుండగులు పరార్

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలోని ఉన్న హుస్సేన్​మియా వాగుపై నిర్మించిన చెక్​ డ్యాంను సోమవారం రాత్రి పేల్చివేసేందుకు గుర్తుతెలియని వ్యక్తులు ప్రయత్నించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి మండలం బోజన్నపేట, కొత్తపల్లి మధ్య హుస్సేన్​మియా వాగుపై నిర్మించిన చెక్​ డ్యాం వద్దకు దుండగులు రాత్రి పూట జిలెటిన్​  స్టిక్స్​, డ్రిల్లింగ్ మెషీన్​తో వచ్చారు.

డ్యాంకు అక్కడక్కడ డ్రిల్​తో రంధ్రాలు వేశారు. జిలెటిన్​ స్టిక్స్​ అమర్చి డ్యాం పేల్చే క్రమంలో  స్థానిక రైతులు గమనించి వారిని వెంబడించారు.  దీంతో దుండగులు అక్కడ నుంచి పారిపోయారు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. దుండగులు  వదిలివెళ్లిన 1 జిలెటిన్  స్టిక్స్, డ్రిల్లింగ్ ​ మెషీన్ ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై మల్లేశ్  తెలిపారు.