
హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా మిస్ వరల్డ్ 2025 అందాల పోటీల ఫైనల్స్ అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ మిస్ వరల్డ్ పోటీల నుంచి మిస్ ఇండియా నందిని గుప్తా నిష్ర్కమించింది. మిస్ వరల్డ్ టాప్ 8లో స్థానం దక్కకపోవడంతో నందిని గుప్తా ఎలిమినేట్ అయ్యింది. మార్టినిక్, బ్రెజిల్, ఇథియోపియా, నమీబియా, పోలెండ్, ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్, థాయ్ లాండ్ దేశ అందాల భామలు మిస్ వరల్డ్ టాప్ 8లో చోటు దక్కించుకున్నారు. ఆసియా అండ్ ఓషియానియా ఖండం నుంచి థాయిలాండ్, ఫిలిప్పీన్స్ భామలు టాప్ 8కు అర్హత సాధించారు. టాప్ 8 నుంచి టాప్ 4ని సెలెక్ట్ చేసి.. ఇందులో నుంచి ఒకరిని మిస్ వరల్డ్ 2025 విజేతగా ప్రకటిస్తారు.
భారత్ వేదికగా జరుగుతోన్న పోటీల్లో మిస్ ఇండియా మధ్యలోనే ఎలిమినేట్ కావడంతో ఇండియన్స్ నిరాశకు గురవుతున్నారు. మిస్ వరల్డ్ ఫైనల్ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, ఖుష్బూ, ఇతర ప్రజా ప్రతినిధులు, సెలబ్రెటీలు హాజరయ్యారు. శనివారం (మే 30) రాత్రి మిస్ వరల్డ్ 2025 ఎవరన్నేది తెలిపోనుంది. మిస్ వరల్డ్ విజేతకు రూ. 8.5 కోట్ల నగదు, 1770 వజ్రాల కిరీటం.. ఏడాది పాటు ఉచితంగా ప్రపంచ యాత్ర సౌకర్యం కల్పించనున్నారు.