ఇంటర్ ఫస్టియర్ క్వశ్చన్ పేపర్లలో మళ్లీ ​తప్పులు

ఇంటర్ ఫస్టియర్ క్వశ్చన్ పేపర్లలో మళ్లీ ​తప్పులు

హైదరాబాద్, వెలుగు: ఇంటర్ క్వశ్చన్ పేపర్లలో మళ్లీ తప్పులు దొర్లాయి. బుధవారం జరిగిన ఫస్టియర్​ కెమిస్ట్రీ, కామర్స్ క్వశ్చన్ పేపర్లలో తప్పులు ఉన్నాయి.  ఒకేషనల్ ​బ్రిడ్జికోర్సు క్వశ్చన్ పేపర్​ను ఇంగ్లిష్, తెలుగు​ మీడియాల్లో ఇవ్వాల్సి ఉండగా.. కేవలం ఇంగ్లిష్ మీడియంలోనే ఇచ్చారు.  దీంతో తెలుగు మీడియం విద్యార్థులకు క్వశ్చన్లు అర్థంకాక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ప్రింటర్ మిస్టేక్​తో తెలుగు వర్షన్ రాలేదని ఇంటర్ బోర్డు సెక్రెటరీ ఉమర్ జలీల్ వివరణ ఇచ్చారు. సమస్యను ఉదయం 8.45 నిమిషాలకు గుర్తించామని చెప్పారు. అయితే  కెమిస్ర్టీ ఇంగ్లిష్ మీడియం పేపర్​లో నాలుగు.. తెలుగు మీడియం, ఉర్దూ మీడియంలో ఒక్కో తప్పు వచ్చింది. కామర్స్​  తెలుగు మీడియంలో రెండు, ఇంగ్లిష్​ మీడియంలో ఒక తప్పు వచ్చింది. ఇంటర్ క్వశ్చన్ పేపర్ల తయారీలో అధికారుల నిర్లక్ష్యంతోనే ఇన్ని తప్పులు వస్తున్నాయనీ ఇంటర్ విద్యాపరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్ రామకృష్ణాగౌడ్ విమర్శించారు.  దీనికి కారణమైన ఇంటర్ బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.

ముగిసిన ఫస్టియర్ పరీక్షలు..

ఈ నెల 6న ప్రారంభమైన ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు.. బుధవారంతో  ముగిశాయి.  కేవలం ఒకేషనల్ బ్రిడ్జికోర్సులకు చెందిన 2 మైనర్ సబ్జెక్టుల పేపర్లున్నాయి. సెకండియర్ పరీక్షలు కూడా  గురువారం ముగియనున్నాయి. బుధవారం జరిగిన ఫస్టియర్ పరీక్షలకు 4,47,295 మంది స్టూడెంట్లకు గాను 4,24,438 మంది అటెండ్ అయ్యారు. పెద్దపల్లి, జగిత్యాల, నిజామాబాద్, ఖమ్మం, వికారాబాద్  జిల్లాల్లో ఒక్కొక్క స్టూడెంట్ చొప్పున ఐదుగురిపై మాల్ ప్రాక్టిస్ కేసులు నమోదయ్యాయి.