గుజరాత్​ జెయింట్స్ మెంటార్​గా మిథాలీ

గుజరాత్​ జెయింట్స్ మెంటార్​గా మిథాలీ

అహ్మదాబాద్: లెజెండరీ క్రికెటర్​ మిథాలీ రాజ్​.. విమెన్స్​ ప్రీమియర్​ లీగ్​(డబ్ల్యూపీఎల్​)లో గుజరాత్​ జెయింట్స్​ టీమ్​కు మెంటార్​, అడ్వైజర్​గా వ్యవహరించనుంది. ఈ మేరకు ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీజన్‌‌‌‌‌‌‌‌కు ముందు ఫ్రాంచైజీతో ఆమె ఒప్పందం చేసుకుంది. గుజరాత్​లో విమెన్స్​ క్రికెట్​ను అభివృద్ధి చేసేందుకు.. మెంటార్​గా మిథాలీ సపోర్ట్‌‌‌‌‌‌‌‌ అందించనుంది. మార్చిలో జరిగే డబ్ల్యూపీఎల్​లో ఐదు జట్లు బరిలోకి దిగనున్నాయి. గత వారం జరిగిన ఫ్రాంచైజీల వేలంలో అదానీ గ్రూప్‌‌‌‌‌‌‌‌  రూ. 1298 కోట్లతో గుజరాత్‌‌‌‌‌‌‌‌ ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. విమెన్స్​ క్రికెట్​ డెవలప్​కావడానికి బీసీసీఐ తీసుకున్న చొరవ చాలా బాగుందని మిథాలీ కితాబిచ్చింది. యంగ్​స్టర్స్​ క్రికెట్​ను ప్రొఫెషన్​గా తీసుకునేందుకు ఇది దోహదం చేస్తుందని చెప్పింది.