
కోరుట్ల/చందుర్తి, వెలుగు: పేదల ఆత్మ గౌరవానికి ప్రతీక ఇందిరమ్మ ఇళ్లు అని విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. బుధవారం కథలాపూర్ మండల కేంద్రంలో 306 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు, 56 మంది లబ్ధిదారులకు రూ.21.21 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రూల్స్ ప్రకారం నిర్ణీత సమయంలో ఇండ్లు నిర్మించుకొని ఆర్థిక సాయం పొందాలన్నారు. వానాకాలం నాటికి కలికోట సూరమ్మ చెరువు రిజర్వాయర్ పనులు పూర్తి చేసి నీటితో నింపుతామన్నారు. అంతకుముందు చందుర్తి మండలం సనుగుల గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. రుద్రంగి మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు బొజ్జ మల్లేశం, లీడర్లు నాగం కుమార్, లింగారెడ్డి, ముకుంద రెడ్డి పాల్గొన్నారు.
వేములవాడ, వెలుగు : వేములవాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 65 మంది లబ్ధిదారులకు రూ.28.48 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను విప్ ఆది శ్రీనివాస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ మెడికల్ హబ్గా మారిందన్నారు. పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్గౌడ్, గూడురి మధు, చిలుక రమేశ్, శ్రీనివాస్, రాంబాబు పాల్గొన్నారు.