బాల్కసుమన్ కు పితృవియోగం..సీఎం సంతాపం

బాల్కసుమన్ కు పితృవియోగం..సీఎం సంతాపం

హైదరాబాద్: చెన్నూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌కు పితృ వియోగం కలిగింది. బాల్క సుమన్ తండ్రి, మెట్‌పల్లి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్క సురేష్ శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం హైదరాబాద్ లోని ఓ హాస్పిట‌ల్ లో మృతి చెందారు. బాల్క సురేష్ మృతి పట్ల ప‌లువురు రాజ‌కీయ‌ నేతలు సంతాపం తెలిపారు. 

బాల్క సురేశ్ మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. మెట్ ప‌ల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గా  పనిచేసిన సురేశ్, టిఆర్ఎస్ పార్టీ క్రియాశీల నాయకుడిగా చురుకైన పాత్రపోషించారని  సిఎం గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే సుమన్ ను,  సిఎం కేసీఆర్ ఫోన్లో పరామర్శించి ఓదార్చారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.