పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం : వివేక్​ వెంకటస్వామి

పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం : వివేక్​ వెంకటస్వామి

కోల్​బెల్ట్, వెలుగు : పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దామని చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ జి.వివేక్​ వెంకటస్వామి అన్నారు. ఆదివారం మందమర్రి పాత బస్టాండ్​ ఏరియాలో పల్స్​ పోలియో కార్యక్రమాన్ని ఆయన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలుతో కలిసి ప్రారంభించారు. చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పోలియో నిర్మూలనకు వ్యాక్సిన్ ​అందుబాటులో ఉందని, రాష్ట్ర సర్కార్​ ఫ్రీగా పంపిణీ చేస్తున్న పోలియో వ్యాక్సిన్​ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పిల్లలందరికీ వ్యాక్సినేషన్​చేయించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

అనంతరం శాంతినగర్​లో రూ.500 కే గ్యాస్​సిలిండర్, గృహజ్యోతి పథకాలను, సీఐఎస్​ఎఫ్​బ్యారక్​లో సౌతిండియా స్థాయి కరాటే పోటీలను ప్రారంభించారు. అనంతరం శ్రీకృష్ణ గార్డెన్స్​లో బూత్​ స్థాయి కాంగ్రెస్​ కార్యకర్తల మీటింగ్​లో చీఫ్​ గెస్ట్​గా పాల్గొన్నారు. సింగరేణి డిస్మిస్​ కార్మికులు వివిధ సమస్యలపై పలువురు ఆయనకు వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో మందమర్రి తహసీల్దార్ ​చంద్రశేఖర్

ట్రాన్స్​కో ఎస్ఈ శేషారావు, డీఈ కైసర్, ఏడీ రాజశేఖర్, ఎస్ఏఓ శ్రీనివాస్, ఏఏఓ రమేశ్, ఏఈ మల్లేశం, మందమర్రి పట్టణ కాంగ్రెస్​ అధ్యక్షుడు నోముల ఉపేందర్​ గౌడ్, లీడర్లు దుర్గం నరేశ్, సోత్కు సుదర్శన్, ఓడ్నాల శ్రీనివాస్, గుడ్ల రమేశ్, నీలయ్య, రాంచందర్, గడ్డం రజనీ, నెరువేట్ల శ్రీనివాస్​తదితరులు పాల్గొన్నారు.

నూతన వధువరులను ఆశీర్వదించిన వివేక్

మందమర్రి పట్టణంలోని మంజునాథ గార్డెన్స్​లో ఐఎన్టీయూసీ లీడర్​ ఎర్రవెల్లి శంకర్​ కూతురు- మౌనిక–భరత్​ వివాహ వేడుకలకు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.