రేగొండ, వెలుగు: ప్రజాపాలనలో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పేర్కొన్నారు. ఆదివారం జిల్లాలోని కొత్తపల్లిగోరి, రేగొండ మండలాల్లోని గ్రామాల్లో పార్టీ మద్దతుదారులైన సర్పంచ్అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
రెండేళ్ల కాలంలో ప్రభుత్వం ఎన్నికల ముందు వాగ్ధానాలతో పాటు మానవీయ కోణంలో రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తోందన్నారు. ఊళ్లకు మంచి చేసేవాళ్లను సర్పంచ్లుగా గెలిపించుకుంటే అభివృద్ధికి మార్గం వేసినవాళ్లు అవుతారని సూచించారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు ఇప్పకాయల నర్సయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజు కిష్టయ్య, నాయినేని సంపత్రావు, మోడెం ఉమేశ్గౌడ్, మ్యాకల భిక్షపతి, మటిక సంతోష్, మైస భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
