
అమీన్పూర్, వెలుగు: కాలనీల భద్రతకు సీసీ కెమెరాలు ఉపకరిస్తాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని న్యూసాయి భగవాన్ కాలనీలో రూ.2లక్షల సొంత నిధులతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ నేరాల నియంత్రణతో పాటు నేరగాళ్లను గుర్తించడంలో సీసీ కెమెరాలు పోలీసు శాఖకు కీలకంగా ఉపయోగపడుతున్నాయన్నారు.
రాష్ర్ట ప్రభుత్వం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రతి కెమెరాను అనుసంధానం చేసి భద్రతాపరమైన సమస్యలు తలెత్తినప్పుడు క్షణాల్లో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారన్నారు. పటాన్చెరు నియోజకవర్గంగలో ప్రతి గ్రామం, పట్టణం, డివిజన్లో కమ్మూనిటీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
కాలనీ ప్రజల కోసం త్వరలోనే మినీ ఫంక్షన్ హాల్, పార్కును ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్మాజీ వైస్ చైర్మన్ నరసింహగౌడ్, సీఐ నరేశ్, నాయకులు మల్లేశ్, బాలరాజు, ప్రమోద్ రెడ్డి, అనిరుధ్రెడ్డి, కృష్ణ, జగదీశ్, దాసు కాలనీ ప్రతినిధులు పాల్గొన్నారు.