కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉచితంగానే ఎల్ఆర్ఎస్

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉచితంగానే ఎల్ఆర్ఎస్

‘ఒక‌సారి కేసీఆర్ ను నమ్మి ఓటేశారు, ఇప్పుడు కూడా ఓటు వేస్తే మీ కొంప ముంచుతాడు’ అని దుబ్బాక ప్ర‌జ‌ల నుద్దేశించి అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేసి, కేసీఆర్ కండ్లు తెరిపించాల‌న్నారు. ప్రజలు ఇప్పటికైనా కండ్లు తెర‌వాల‌న్నారు.

కరోనా సమయంలో డబ్బులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని…LRS కట్టాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉచితంగానే LRS చేస్తుందని హామీ ఇచ్చారు. ఖజానా నింపుకోవడం ప్రజల జీవితాల కోసం ప్రభుత్వం ఆటలాడుతోందని మండిపడ్డారు. LRS డబ్బులు చెల్లిస్తే ఆ తరవాత మీరు చెల్లించిన డబ్బులు ఎక్కడవని మళ్ళీ అడుగుతారని అన్నారు. అప్పుల పాలై ప్రజలెవరూ ఎల్ఆర్ఎస్ కట్టవద్దని…టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎలా దించాలి, ఆస్తులు ఎలా కాపాడుకోవాలో ఆలోచించాలని ప్రజలకు సూచించారు. ఎన్నికల్లో TNGO లు కూడా బీర్ బాటిల్స్ పంచార‌ని, ఇప్పుడు TNGO ల నేతల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాల‌ని హిత‌వు ప‌లికారు.