- ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కడియంకు నిలదీత
ధర్మసాగర్ (వేలేరు), వెలుగు : పంచాయతీ రెండో విడత ఎన్నికల్లో భాగంగా గురువారం హనుమకొండ జిల్లా వేలేరు మండలం షోడశపల్లిలో నిర్వహించిన ప్రచారంలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని నిలదీశారు. ఇందిరమ్మ ఇండ్లు అర్హులకు ఇవ్వలేదని, అనుచరులకే ఇచ్చారని ప్రశ్నిస్తూ గ్రామస్తులు మండిపడ్డారు. దీంతో మధ్యలోనే ఎమ్మెల్యే వెళ్లిపోయాడు.

